నన్ను అంతమొందించేందుకు కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

-

తనను అంతమొందించేందుకు  కుట్ర జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమార్తెకు కులాంతర వివాహం చేసి వార్తల్లో నిలిచిన ప్రొద్దుటూరు  ఎమ్మెల్యే రాచమల్లు గురించి అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయనగా..రాచమల్లు ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశం అయింది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దీనికి సంబంధించిన బలమైన ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ  నేతల వ్యక్తిత్వం బలహీనపడుతుందని అని అన్నారు. వైసీపీ అభ్యర్థులను ఓడించడానికి బలమైన కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే నా ఫేస్‌ బుక్‌  ఖాతాను కూడా హ్యాక్‌ చేసినట్లు ఆయన తెలిపారు. నా ఫోన్‌ కూడా హ్యాక్‌ చేయాలని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో 50 లక్షలకు ఒప్పందం జరిగినట్లు నాకు తెలిసింది. ఇప్పటికే ఆ వ్యక్తికి సగం డబ్బులు కూడా ఇచ్చారని రాచమల్లు

Read more RELATED
Recommended to you

Latest news