విశాఖలో వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్

-

విశాఖపట్టణంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కప్పి సాదరణంగా ఆహ్వానించారు. వంశీ కృష్ణ యాదవ్ తో పాటు విశాఖపట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

జనసేన పార్టీలో చేరిన అనంతరం ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై తాను ఈ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. కొన్ని శక్తుల కుట్రల తన పట్ల కుట్రలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ పరిణామాలే వైసీపీ నుంచి బయటికి వచ్చేవిధంగా చేశాయి అని చెప్పుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Latest news