ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

-

ఓ మహిళకు సాయం విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజావాణిలో న్యాయం జరుగలేదని ఓ మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు  అందించారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన సీఎం రేవంత్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.10 ఏళ్లు అధికారంలో ఉండి దోచుకున్న లక్ష కోట్లలో లక్ష రూపాయలే కేటీఆర్ పంచారని వ్యాఖ్యానించారు. మిగతా డబ్బులను కూడా ఖచ్చితంగా ప్రజలకు పంచేలా చేస్తామని సీఎం అన్నారు.

వారు ప్రజల రక్తం పిండి సంపాదించారని, ఆ ఆస్తులన్నింటినీ కరిగిస్తానని వ్యాఖ్యానించారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని, అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌కు కూడా కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్ వెనక్కి వెళితే అడగని వినోద్ కుమార్.. సైనిక్ స్కూల్‌ గురించి అడగని ఆయన.. బుల్లెట్ ట్రైన్ గురించి తమకు నీతులు చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news