BREAKING : సీఎం జగన్ కు మోహన్ బాబు లేఖ !

-

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచాలని… టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అటు దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టికెట్ల విషయంలో తాము వెనుకడుగు వేసేది లేదంటూ.. జగన్ సర్కార్ ముందుకు సాగుతోంది.

అటు ఈ వ్యవహారంపై హీరో నాని, సిద్ధార్థ జగన్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగుందా అంటూ నాని విమర్శలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు టిక్కెట్ల ధరల విషయంపై స్పందించని మోహన్ బాబు తాజాగా ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల వ్యవహారం పై రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచు మోహన్ బాబు. టికెట్ల ధరలు పెంచాలని ఈ సందర్భంగా మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news