విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపీ తీరుతాం – ఎంపీ అయోధ్య రామిరెడ్డి

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపీ తీరుతామని స్పష్టం చేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఇవాళ గుంటూరులో మీడియాతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.

ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం దగ్గరే ఉండాలన్నారు. పార్లమెంట్ వేదిక గా కూడా మా నిర్ణయం చెప్పాం..ప్రైవేటీకరణ ఆపి తీరతామని హెచ్చరించారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ప్రధానిని కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి చెందిన సమస్యలను ప్రస్తావిస్తున్నామని.. ప్రజా మద్దతు బుక్ తో ప్రజల దగ్గరకు వెళ్తున్నామని చెప్పారు. మా పాలన పై ప్రజల తో సర్వే చేస్తున్నామన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version