పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి సినిమా చిందులు వేశారు – ఎంపీ భారత్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. జనసేనాని ఢిల్లీలో సినిమా యాక్టింగ్ బాగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హోదా పాచిపోయిన లడ్డు అన్న వ్యక్తి బిజెపి వైపు ఎలా చేరారు..? అని నిలదీశారు. బిజెపిని తిట్టి 2019లో ఒంటరిగా పోటీ చేసి, 2024లో ఎందుకు ఎన్డీఏ ను కలుపుకొని వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక ఊసరవెల్లి అని.. ఆయన రోజుకో మాట మాట్లాడతారని ఆరోపించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో భోజనం చేసి తెలంగాణలో నిద్రపోయే వ్యక్తులని విమర్శించారు. ఇలాంటి వలస నాయకులతో మనకు ఏం పని..? అన్నారు. సీఎం జగన్ తన కుటుంబంతో సహా ఏపీలోనే ఉంటున్నారు కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం వలస పక్షులని అన్నారు. పవన్ ఢిల్లీ వెళ్లి సినిమా చిందులు వేశారని, ప్రధాని నరేంద్ర మోడీ వెనుక నిలుచున్న ఆయన వ్యాల్యూ ఏంటో తెలిసిపోయిందన్నారు. నిన్న ఢిల్లీలో పవన్ ఇంగ్లీషులో మాట్లాడారని.. ఇలా కూడా మాట్లాడవచ్చా అని తనకు అనిపించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news