రాజుగారు మార‌క‌పోతే పిచ్చి మారాజ‌వ్వ‌డం ఖాయ‌మేనా..!

-

వైఎస్సార్ సీపీ అసంతృప్త ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ కృష్ణ‌రాజు ప‌రిస్తితి ఎలా ఉంది ?  పార్టీలో ఆయ‌న ఒంట‌రి అయిపోయారు. ఎవ‌రూ ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం చేస్తున్న విమ‌ర్శ‌లు కూడా త‌గ్గిపోతే.. ఇప్పుడు స‌పోర్టు చేస్తున్న ఎల్లో మీడియ కూడా ఆయ‌న‌ను వ‌దిలేయ‌డం ఖాయం. అయిన‌ప్ప‌టికీ. రాజుగారు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. చిన్న విష‌యాల‌ను కూడా పెద్ద‌వి చేసేస్తున్నారు. చిన్న చిన్న ఆరోప‌ణ‌ల‌ను కూడా ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. స‌హ‌జంగానే ఏపార్టీలో అయినా.. ధిక్కార స్వ‌రం వినిపించిన నాయ‌కుల‌ను సోద‌ర నాయ‌కులు రాజీనామా చేసి వెళ్ల‌మ‌ని డిమాండ్ చేస్తారు.

అంతెందుకు… టీడీపీ త‌ర‌ఫున గెలిచి వైఎస్సార్ సీపీకి మ‌ద్ద‌తుదారులుగా మారిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరిల‌ను కూడా టీడీపీ నేత‌లు ఇదే డిమాండ్ చేశారు. అయినంత మాత్రాన వారు రాజు గారి మాదిరిగా రెచ్చిపోలేదు. పైగా ఎక్క‌డా ఉలిక్కి ప‌డ‌లేదు. కానీ, రాజుగారిలో మాత్రం కోపం క‌ట్ట‌లు తెగుతోంది. నిజానికి రాజుగారు ఇన్నేసి రూపాల్లో పార్టీని, ప్ర‌భుత్వాన్ని ఏకేస్తుంటే.. వైఎస్సార్ సీపీ నేత‌లు నోరు మూసుకుని ఉండాల‌ని కోరుకోవడంలో అర్ధం లేదు. వారు మాత్రం ఉప్పు కారాలు తిన‌డం లేదా ? ఒక్క రాజుగారే తింటున్నారా?  కానీ, రాను రాను రాజుగారి ప‌రిస్థితి మాత్రం ఆవేశానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజాగా కూడా రాజుగారు త‌న‌ను రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ సీపీ నేత‌ల‌పై రెచ్చిపోయారు. పిచ్చినా.. అంటూ రెచ్చిపోయారు. అదే స‌మ‌యంలో త‌న‌కు రాజీనామా చేయ‌డం చిటిక‌లో ప‌ని అని చెప్పారు. అంతేకాదు.. తాను రాజీనామా చేస్తే.. మూడు రెట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కుతాన‌ని చెప్పారు. మ‌రి నిజంగానే రాజుగారికి అంత ధైర్యం ఉంటే.. రాజీనామా చేసి పారేసి.. మూడు రెట్ల మెజారిటీతో గెలిచి చూపిస్తే.. ఇప్పుడు నోరు పారేసుకుంటున్న నేత‌ల‌కు అంత‌క‌న్నా బుద్ధి చెప్పిన వారు అవుతారు క‌దా?  కానీ, ఆయ‌న ఆ ప‌నిమాత్రం చేయ‌కుండా బీపీ పెంచుకుంటే.. చివ‌ర‌కు ఆయ‌న ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని పిచ్చిమారాజు కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు న‌ర‌సాపురం ప్ర‌జ‌లు..!

Read more RELATED
Recommended to you

Latest news