రఘురామ కృష్ణంరాజు పంచ్.. సీఎం జగన్ కి షాక్..!

-

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పనికిరాని వారందరిని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారని.. వాళ్ళ సలహాల వాళ్ళ త్వరలో జగన్ కి గట్టి దెబ్బ తగలబోతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా వాళ్ళందరినీ తీసేసి, మంచి వారిని న్యాయ సలహాదారులగా పెట్టుకోవాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శత మొట్టికాయ ఉత్సవం జరుగుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు రఘురామ కృష్ణంరాజు.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శత మొట్టికాయ ఉత్సవం ఎంతో దూరంలో లేదనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు తెచ్చి ఏపీలో అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక అమరావతి గురించి మాట్లాడుతూ.. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని ఆయన స్పష్టం చేశారు.  రైతులు భయపడాల్సిన అవసరం లేదని, వారే గెలుస్తారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  అమరావతి రైతులు అందరూ కలిసి ఇలాగే ముందుకు వెళ్తే.. తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version