మరో 15 సంవత్సరాలు జగనే సీఎం: ఎంపీ సురేశ్

-

మరో 15 సంవత్సరాలు జగనే సీఎం అని ycp ఎంపీ సురేశ్ అన్నారు. పేదవాడిని కోటీశ్వరుడిని చేసే సత్తా సీఎం జగన్ కు మాత్రమే ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వెంకటపాలెం సభలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో 176 సీట్లలో విజయం సాధిస్తాం అన్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు నెరవేర్చామని, మరో 15 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారని చెప్పారు.

గతంలో 600 హామీలిచ్చి నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే చూసి తట్టుకోలేని చంద్రబాబు కేసులు పెట్టడానికి కోర్ట్ లకు వెళ్లిన పరిస్థితి మీరందరూ ఆలోచించాలి అన్నారు. ఇక్కడ మీకు ఇల్లు ఇస్తే అమరావతిలో అభివృద్ధి ఆగిపోతుందని అర్ధం లేని ఆలోచనలతో మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని వాస్తవాన్ని తెలియచేసే ప్రయత్నం చేశారు.  ఏపీలో మళ్ళీ జగన్ అఖండ విజయం సాధిస్తారని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news