టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ వెళతారు – ముద్రగడ కొడుకు

-

Mudragada : ముద్రగడ కుమారుడు గిరి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుమారుడు గిరి బాబు స్పందించారు. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉంది…వైసీపీలోకి వెళ్లడానికి పద్మనాభం ఇంట్రెస్ట్ చూపడం లేదని పేర్కొన్నారు. ఇద్దరు పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు ముద్రగడ కుమారుడు గిరి బాబు.

Mudragada goes to TDP or Janasena

కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం లలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని తెలిపారు. మరిన్ని చర్చలు జరుగుతాయి….గతం లోనే చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామన్నారు ముద్రగడ కుమారుడు గిరి బాబు. త్వరలోనే నిర్ణయం ఉంటుంది….అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు ముద్రగడ కుమారుడు గిరి బాబు. కాగా ముద్రగడ పద్మనాభంను టీడీపీ, జనసేన పార్టీ నేతలు కలిసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news