జగన్‌ పై నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు..అందుకే 11 సీట్లంటూ !

-

మాజీ సీఎం జగన్ పై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జైల్ వద్ద మాజీ సీఎం జగన్ కామెంట్లకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లడుతున్నారో మీకు అర్ధమవుతుందా? అని ప్రశ్నించారు. కోపమొచ్చి ఈవీఎంలప పగలగొట్టారా?? అంటూ ఆగ్రహించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.

Nagababu’s controversial comments on Jagan

ఒకవేళ నిజంగా అన్యాయం జరగుంటే అక్కడ పోలిస్ సిబ్బంది లేరా ఎన్నికల సిబ్బంది లేరా? ఆర్వో లేరా?? ఇవన్నీ ఆలోచించకుండా కోపమొచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్దిస్తారా మీరు?? అని ప్రశ్నించారు. ఏం మాట్లడుతున్నారండి బాబు ?? మిడిమిడి జ్ఞానంతో మితీమీరీన ఏచ్చులకి పోయినందుకే పదకొండుకే పరిమితం చేసారు ప్రజలు అంటూ చురకలు అంటించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఇకనైన మీరు పరిపక్వత పొందకుంటే ఈసారి సింగల్ డిజిట్టునే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news