వెస్ట్ బెంగాల్ లో తేలిన చోరీ అయిన సెల్ ఫోన్స్ కంటైనర్ !

-

సినీ ఫక్కీలో గత నెలలో కొందరు దుండగులు భారీ దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ కంటైనర్లో తరలిస్తున్న ఎంఐ కంపెనీకి చెందిన ఫోన్లను మరో లారీతో గుద్దించి ఎత్తుకెళ్లిపోయారు. చిత్తూరు జిల్లాలోని నగరి పరిధిలో జరిగిన ఈ దొంగతనం అప్పట్లో సంచలనంగా మారింది. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ నుంచి ముంబైకి వెళ్తున్న ఈ లోడును అక్కడి నుండి ఫాలో అయి వచ్చిన దుండగులు ఏపీ బార్డర్ వచ్చాక కంటైనర్ ను మరో లారీతో గుద్దించి డ్రైవర్ ను చితకబాది తాళ్లతో కట్టేసి పొదల్లో పడేసి కంటైనర్ ను ఎత్తుకెళ్లిపోయారు.

nagari

అయితే ఈ కేసులో పురోగతి లభించినట్టు తెలుస్తోంది. ఈ ముఠా లారీలోడుతో పశ్చిమ బెంగాల్ వెళ్లినట్టు గుర్తించారు. గతంలో ఇదే తరహాలో హైదరాబాద్, తడ, నెల్లూరులో ఆ ముఠా దొంగతనాలు చేసినట్టు గుర్తించారు. కేసును చేధించేందుకు అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్ళాయి. రెండు మూడు రోజుల్లో నిందితులని ఈ టీమ్స్ వారందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news