చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలి: వైసీపీ ఎమ్మెల్యే

-

టీడీపీ అధినేత చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తెలుగుదేశం నేతల్లోనే సానుభూతి లేదని వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసాడు కాబట్టే చట్టం అరెస్టు చేసిందని వెల్లడించారు.

రాజమండ్రి జిల్లా చంద్రబాబును పెట్టారని… నందమూరి తారక రామారావు పై చెప్పులు వేయించిన వ్యక్తి… ఇలాంటి చావు చస్తాడో కూడా చూస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ శిక్ష సరిపోదని… నడిరోడ్డుపై ఉరితీయాలని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీస్తేనే ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటారని… అలాగే సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు ఘోర ఓటమి తప్పదని… ముచ్చటగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news