పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకు అమ్మేశాడు – కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి

-

పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబుకు అమ్మేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ..జనసేన ఇంకా అందరూ కలుస్తారని చెబుతున్నారని…అసలు జనసేన పార్టీ ఉందా అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు…ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతాను అని పవన్ అంటున్నాడు…నువ్వు ప్యాకేజీ స్టార్ వే అంటూ ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు సూట్ కేసులు చేతులు మారాయని…దమ్ముంటే నన్ను చెప్పుతో కొట్టు చూద్దామని ఛాలెంజ్‌ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలని రంగా ను చంపించిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతావా…నిన్ను ప్రజలు క్షమించరన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు. నాయకులు .. ఫ్యాన్స్ అందరు కూడా చీదరించుకుంటారు… ఎవరు వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఏమి పీకలేరని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version