తిరుమలలో చనిపోయిన చిన్నారి మృతిపై నల్లపురెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

-

తిరుమల ఘాట్ రోడ్ లో మృతి చెందిన లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మి మృతి పై నాకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. లక్షిత తల్లిదండ్రులపై నాకు అనుమానం ఉందని వెల్లడించారు.

వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారించాలని.. ఈ ఘటనపై టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలతో మాట్లాడానని తెలిపారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక లక్షిత మృతి చెందింది. తిరుమలకు కాలినడకన వెళుతుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. దీంతో బాలిక లక్షిత స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కోవూరులోని పోతిరెడ్డిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news