షాకింగ్ : టీడీపీ నేత నన్నపునేని రాజకుమారికి తలకు గాయాలు!

-

తెలుగు దేశం పార్టీ మహిళా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయని తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి లోని తన ఇంట్లో కాలు జారి నన్నపనేని పడిపోయినట్టు సమాచారం. దీంతో ఆమె తలకు గాయం అయిందట. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బానే ఉందని ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.

అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నన్నపనేని రాజకుమారి టీడీపీ కీలక మహిళా నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ తరపున అనేక పదవులు చేపట్టిన ఆమె 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నన్నపనేని రాజకుమారిని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ గా నియమించింది. ఇక అప్పటి నుండి ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వయోభారం కారణంగానే ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఆమె కుమార్తె నన్నపనేని సుధ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news