ఆ రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న నారా భువనేశ్వరి..!

-

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో, కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ క్రమంలో కుప్పంలోని నాలుగు మండలాల్లోని మహిళలతో సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజారిటీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మునిరత్నం తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజారిటీ వచ్చిన భూతులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news