BREAKING : సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేష్ !

-

BREAKING : సీఐడీ విచారణకు హాజరయ్యారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసు విచారణలో భాగంగా తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్..సీఐడీ విచారణకు హాజరయ్యారు. కరకట్ట ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన నారా లోకేష్..విచారణకు హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు లోకేష్‌ ను విచారించనుంది సీఐడీ. కాగా IRR కేసులో A-14గా ఉన్నారు నారా లోకేష్.

ఈ మేరకు గత 10 రోజుల కిందట నారా లోకేష్‌ కు ఢిల్లీకి వెళ్లి మరీ.. నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. ఇది ఇలా ఉండగా, తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. IRR కేసులో ఈ నెల 11న విచారణకు రావాలని నారాయణ అల్లుడు పునీత్ కి సీఐడీ నోటీసులు జారీ చేసింది. అటు ఇప్పటికే సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news