రేపు రాత్రి 7 గంటల ఇళ్లలో లైట్లు ఆపి..చంద్రబాబుకు మద్దతు ఇవ్వండి – లోకేష్‌

-

రేపు రాత్రి 7 గంటల ఇళ్లలో లైట్లు ఆపి..చంద్రబాబుకు మద్దతు ఇవ్వండని నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. ఏపీ స్కీల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ లో భాగంగా… చంద్రబాబు సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని.. చంద్రబాబు మద్దతు ఇవ్వాలని కోరారు నారా లోకేష్‌.

nara lokesh chandrababu

ఈ మేరకు ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని లోకేష్‌ పోస్ట్‌ పెట్టారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండని పిలుపునిచ్చారు నారా లోకేష్‌ .

జ‌గ‌న్ సైకోయిజం వైసీపీ కార్య‌క‌ర్తల‌కీ అంటుకుంది. రాజ్యాంగ‌వ్య‌వ‌స్థ‌ల విధ్వంసానికి పాల్ప‌డుతూ, ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షనేత‌ల్నే కాకుండా ప్ర‌జ‌ల్ని కూడా హింసిస్తూ సైకో జ‌గ‌న్ త‌న‌ శాడిజం చూపిస్తున్నాడని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news