పాద‌యాత్ర‌ ప్ర‌జ‌ల యాత్ర అయింది… యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మైంది – నారా లోకేష్

-

పాద‌యాత్ర‌ ప్ర‌జ‌ల యాత్ర అయింది… యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మైందని నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. తన పాదయాత్ర 100 రోజులు అయిన నేపథ్యంలో ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌. అడ్డంకుల్ని లెక్క చేయ‌లేదు. ఎండ‌ల‌కి ఆగిపోలేదు. వాన ప‌డితే చెదిరిపోలేదు. ప్ర‌జ‌ల కోసం నేను..నా కోసం ప్ర‌జ‌లు యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని ముందుండి న‌డిపిస్తున్నారని వివరించారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర వంద‌రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌జ‌లు, యువ‌గ‌ళం వ‌లంటీర్లు, క‌మిటీలు, తెలుగుదేశం కుటుంబ‌స‌భ్యులు, అభిమానులకు హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు. పాద‌యాత్ర‌ ప్ర‌జ‌ల యాత్ర అయింది. యువ‌గ‌ళం జ‌న‌గ‌ళ‌మైంది.యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని విధ్వంసక, ఆట‌విక‌ స‌ర్కారుపై ప్ర‌జాదండ‌యాత్ర‌ని చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news