అమ్మకి అన్నం పెట్టడు.. గురువుకి దండం పెట్టడు – జగన్‌ పై లోకేష్‌ సంచలనం

-

అమ్మకి అన్నం పెట్టడు.. గురువుకి దండం పెట్టడని ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ అగ్రనేత నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువును మించిన దైవం లేదు. విద్యాబుద్ధులు నేర్పి సమాజ ఉన్నతికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్‌.

అమ్మకి అన్నం పెట్టని వాడు.. గురువుకి దణ్ణం పెట్టనివాడు ముఖ్యమంత్రిగా ఉన్నారని జగన్‌ పై ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. గౌరవం మాట దేవుడెరుగు జగన్ రెడ్డి గారి పాలనలో ఉపాధ్యాయులకు జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. జే బ్రాండ్ లిక్కర్ షాపు ముందు సెక్యూరిటీ డ్యూటీ వెయ్యడం దగ్గర మొదలుకొని ఫేషియల్ రికగ్నైజేషన్ వరకూ వేధింపుల పర్వం కొనసాగుతోంది. గురుపూజోత్సవం సందర్భంగానైనా జగన్ రెడ్డి గారి ఆలోచనలో మార్పు వచ్చి ఉపాధ్యాయులను గౌరవించాలని కోరుకుంటున్నానన్నారు నారా లోకేష్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news