ఏపీ రెడ్లు..ఎస్సీలుగా పుట్టాలని అనుకుంటున్నారు – డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

-

అమరావతి: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నడిచేది ఇది రెడ్ల రాజ్యం కాదని…. బడుగుల రాజ్యమంటూ పేర్కొ న్నారు నారాయణ స్వామి. జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు నారాయణ స్వామి. బడుగులకు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత చూసి.. తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారన్నారు నారాయణస్వామి.

దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. అందుకే ఆయన ఫొటో పట్టుకునే ఛాంబర్లోకి ప్రవేశించానన్నారు. కాళ్లు పట్టుకుంటేనో.. కాకపడితేనో జగన్ పదవులివ్వరని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ గుర్తింపునిస్తారని వెల్లడించారు నారాయణ స్వామి. రెండోసారి పదవి దక్కుతుందని ఊహించ లేదని..ఈ అవకాశం ఇచ్చి నందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటానని చెప్పారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

 

Read more RELATED
Recommended to you

Latest news