వైసీపీ పార్టీలో రెండు వర్గాలు – డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

-

చిత్తూరు : వైసీపీ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీపై కామెంట్‌ చేశారు. వైసిపి లో రెండు వర్గాలుగా విడిపోతున్న రెడ్లు దళితులపై పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేసి వాలంటీర్లకు సన్మానం చేసిన నారాయణస్వామి వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని తెలిపారు. రెడ్లు లేకపోతే నేను గెలవలేనని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

వైసీపీలో ఉంటూ రెండుగా వర్గాలుగా మారడంతో మధ్యలో దళితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎస్ సి లను చీల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గ పోరు కు రె డ్లు స్వస్తి పలకాలని కోరారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. దీనిపై అందరూ నాయకులు.. ఆలోచనణ చేయాలని.. పార్టీ లో ఇలాంటి సమస్యలు ఉండవద్దని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news