ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానానికి సర్కార్ ప్రణాళికలు..!

-

ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు టీంల ఏర్పాటు చేయగా… ఒక్కో టీంలో ముగ్గురు చొప్పన అధికారులు ఉన్నారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక-తెలంగాణ, తమిళనాడు-కేరళ రాష్ట్రాలకు వెళ్లనున్నాయి ఈ నాలుగు బృందాలు. ఆ రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై అధ్యయనం చేస్తాయి బృందాలు.

ట్రాక్ అండ్ ట్రేస్, డీ-ఎడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైనా దృష్టి సారించనున్న బృందాలు… ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాయి. ఈ నెల 12వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కొత్త ఎక్సైజ్ విధానాన్ని సిద్దం చేసేలా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలనుకుంటుంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news