అఖిలకు నో బెయిల్.. జీవిత కాలం శిక్ష అంటూ కోర్ట్ వ్యాఖ్యలు !

-

బోయినపల్లి కిడ్నాప్ కేసు దాఖలు మరో సారి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు సికింద్రాబాద్ కోర్టు నిరాకరించింది. మరో పక్క అఖిలప్రియ మీద పోలీసులు అదనపు సెక్షన్ లు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దు అని పోలీసులు వాదించారు. అఖిల మీద రాబరీ కేసు కూడా చేర్చడంతో జీవిత కాలం శిక్ష పడే కేసులలో తాము తీర్పు ఇవ్వలేమని సికింద్రాబాద్ కోర్టు పేర్కొంది. దీంతో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనుంది అఖిల ప్రియ.

పిటీషనర్ కు గతం లో నేర చరిత్ర ఉందని, కుటుంబానికి ఫాక్షన్ చరిత్ర ఉందని, మాజీమంత్రి, డబ్బ, పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. నేరానికి సంబంధించిన అన్నీ ఆధారాలు ఉన్నాయని పరారీలో ఉన్న నిందితంల కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఈకేసులో తప్పించుకోడానికి మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కిడ్నాప్ కేసునిందులను దోపిడి దారులుగా పరిగణించాలని కోరారు. 

Read more RELATED
Recommended to you

Latest news