ఏపీలో మళ్ళీ శిరోముండనం కలకలం !

-

ఏపీలో ఇద్దరు దళిత యువకులకి చేసిన శిరోముండనం ఘటనలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శిరోముండనం కలకలం రేగింది. అభిలాష్ అనే యువకునికి విజయసాయి అనే యువకుడు శిరోముండనం చేయించినట్టు తెలుస్తోంది. విజయసాయి బంధువైన ఒక మహిళకు అభిలాష్ 28 వేలు రూపాయలు బాకీ పడ్డాడు.

బాకీ తీర్చకపోవటంతో పార్టీ ఉందని చెప్పి అభిలాష్ ను రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి ఖాళీగా ఉన్న భూముల్లోకి పిలిపించాడు విజయసాయి. వచ్చిన వెంటనే అభిలాష్ తో గొడవ పెట్టుకున్న విజయసాయి అతనికి శిరోముండనం చేయించినట్టు తెలుస్తోంది. దీంతో జంగారెడ్డిగూడెం పోలీసులకు అభిలాష్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు విజయసాయి ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుడు అభిలాష్ ను అతని స్వగ్రామం అయిన తాడేపల్లిగూడానికి పోలీసులు రహస్యంగా తరలించినట్టు చెబుతున్నారు. అలానే ఈ సమాచారం మీడియాకు ఎక్కడా అందకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news