అవినాష్ రెడ్డి తల్లి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది – పట్టాభి

-

అవినాష్ రెడ్డి తల్లి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి అరెస్టుకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ అయ్యిందని వెల్లడించారు.

ప్రవేట్ సైన్యాన్ని మొహరించి సిబీఐని అడ్డుకుంటున్నారు.. కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుని బలగాలు పంపించాలని సీబీఐ అధికారులను కోరారు టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి రామ్. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే సిబిఐని ప్రైవేట్ సైన్యం అడ్డుకుంటుందని వెల్లడించారు. అవినాష్ రెడ్డి తల్లి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని సంచలన ఆరోపణలు చేశారు టిడిపి జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభి రామ్. శ్రీ లక్ష్మి గారిని హైదరాబాద్ లేదా బెంగళూరు ఎందుకు తరలించట్లేదని నిలదీశారు పట్టాభి రామ్.

Read more RELATED
Recommended to you

Latest news