టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ లో పవన్ కు దక్కని చోటు..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తాజాగా విడుదల చేశారు.   ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం  ఫస్ట్ లిస్ట్ లో మొత్తం 118  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసే 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు.  తన స్థానాన్ని మాత్రం  ప్రకటించలేదు. చంద్రబాబు 94 మంది పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. జనసేన మిగిలిన 19 మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాకపోవడంతో పేర్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం గమనార్హం. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తాడని వార్తలు వినిపించాయి. కానీ ఈ రోజు మాత్రం ప్రకటించలేదు. 

Read more RELATED
Recommended to you

Latest news