టీడీపీ-జనసేన వి దింపుడు కళ్లెం ఆశలు : సజ్జల 

-

టీడీపీ-జనసేన వి దింపుడు కళ్లెం ఆశలు అన్నాు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు పడేసే వాటితో పవన్ కళ్యాణ్  తృప్తి పడుతున్నాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు ప్రాంతాల్లో ఓడిపోయాడు. పవన్ ని చూస్తే జాలి వేస్తుంది. అప్పనంగా వచ్చిన జనసేనను చంద్రబాబు మింగేశాడు. ఎవ్వరూ ఎన్ని చేసినా.. ఎన్ని స్థానాల్లో పోటీచేసినా వైసీపీ గెలుస్తుందన్నారు. 

కుప్పంలో కూడా ఈ సారి వైసీపీ విజయంసాధిస్తుందని ధీమా వ్యక్తం సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ కంటే.. ఆయనను అభిమానించే వారిపై జాలి కలుగుతుందన్నారు సజ్జల. చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో చెప్పే స్థితిలో పవన్ కళ్యాణ్ లేడు అన్నారు. జనసేన ఎప్పుడూ టీడీపీకీ అనుబంధ పార్టీనే. పవన్ కళ్యాణ్ కి ఒక రాజకీయ పార్టీ నడిపే సత్తా, లక్షణాలు లేవు అన్నారు. ఎన్నో ప్రగల్బాలు పలికిన పవన్.. ఇప్పుడు ఇంతకు దిగజారాడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పొమ్మంటే.. పవన్ కళ్యాణ్ అక్కడికి పోతాడు అన్నాడు. ఆశించిన సీట్లు రావు అనే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు సజ్జల. 

Read more RELATED
Recommended to you

Latest news