ఫిష్షింగ్ హార్బర్‌లో ప్రమాదంపై ఆర్థిక సహాయం ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌

-

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో తగలబడిపోయిన 60కి పైగా బోట్ల కుటుంబాలకు జనసేన ఆర్థిక సాయం చేసింది. విశాఖ షిప్పింగ్ హార్బర్ లో తగలబడిపోయిన 60కి పైగా బోట్ల కుటుంబాలకు జనసేన పార్టీ తరుపున ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఆర్దిక సాయం ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పవన్‌ కళ్యాణ్‌.

pawan kalyan

ఇది ఇలా ఉండగా… విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 60 కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తు న్నారు. అయితే…విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు. అటు విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి 80 శాతం పరిహారం చెల్లించాలని సీఎం జగన్‌ కూడా ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news