పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు – మంత్రి దాడిశెట్టి రాజా

-

కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. నేడు తొండంగి మండలం పెరుమాళ్లాపురంలో జగనన్న సురక్షలో పాల్గొన్న మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకొని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ మాటలలో సీఎం జగన్ పై ఈర్ష, ఆయన కళ్ళల్లో ఓటమి భయం కనిపిస్తుందని అన్నారు.

2024 ఎన్నికలలో జనసేన, టీడీపీలు సముద్రంలో కలిసిపోవడం ఖాయం అని అన్నారు. పవన్ కళ్యాణ్ కి పిచ్చి ప్రేలాపనలు తప్పితే రాష్ట్రం గురించి ఏం తెలియదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news