నేడు మంత్రి గుడివాడ అడ్డాలో పవన్ కళ్యాణ్ పర్యటన

-

మంత్రి గుడివాడ అమర్నాథ్ అడ్డాలో ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నేడు కశింకోట (మం) విస్సన్నపేటకు ఇవాళ మధ్యాహం తర్వాత వెళ్లనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. మారేడుపూడి జంక్షన్ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది జనసేన పార్టీ స్థానిక నాయకత్వం.

విస్సన్నపేటలో ప్రభుత్వభూములను మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నాయకులు ఆక్రమించారనేది జనసేన పార్టీ ముఖ్య ఆరోపణ. ఇక ఇప్పటికే ఈ అంశంపై జనసేనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మంత్రి అమర్నాథ్. తన పేరుతో ఒక్క సెంటు భూమి ఉన్నట్టు నిరూపిస్తే జనసేనకు రాసిచ్చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక ఇవాళ పవన్ కల్యాణ్‌ టూర్ తో అలెర్ట్ అయ్యారు పోలీసులు. నెలరోజుల పాటు అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news