పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.. హైదరాబాద్ కి పయనం..!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దు అయ్యింది. అనారోగ్యం (జ్వరం) కారణంగా పవన్ కల్యాణ్ ఇవాల్టి పర్యటనను రద్దు చేసుకున్నారు. అస్వస్థతకు గురి కావడంతో ఆయన హైదరాబాద్ కి బయలుదేరారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ డైలీ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాను పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తిస్తున్న జనసేనాని.. పార్టీ అధినేతగా జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతోన్న చోట ప్రచారం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా వరుసగా సభలు, ప్రచారంతో తీరిక లేకుండా ఉండటంతో పవన్ అస్వస్థతకు గురి అయ్యారు. ఈ క్రమంలోనే ఇవాల్టి షెడ్యూల్ మొత్తం క్యానిల్స్ చేసుకుని హైదరాబాద్ పయనమయ్యారు. ఇక, అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 సీట్లు దక్కాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ప్రచారంలో
దూకుడు పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news