నాగబాబు పోటీ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

-

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమిని ఏర్పాటు చేయడం కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. పెద్ద మనసుతో పొత్తులకు వెళ్తే తాను కూడా సీటు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అంతేకాదు.. ఈ పొత్తు వల్ల సోదరుడు నాగబాబు కూడా సీటు వదులుకున్నారని వెల్లడించారు. బీజేపీ సీట్లు కోరుకోవడం వల్ల జనసేన కొన్ని సీట్లు వదులుకున్నదని చెప్పారు. కాగా, ఈ సారి పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. ఎంపీగా పోటీ చేయటం పైన కూటమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news