ఎమ్మెల్యేగానే పోటీ.. ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదు : పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయాలు రోజు రోజుకూ కాదు గంటగంటకు ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019లో 30 స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాను.. అందరూ ఒత్తిడి చేస్తే నిస్సహాయత ఒడిలేసాను.నేను ఓడిపోతున్నా అని కూడా నాకు తెలుసు. భీమవరంలో కూడా ఓడి పోతాను నాకు ప్రచారం ముగిసిన వెంటనే తెలిసిందని వెల్లడించారు. గాజువాక ఎలాగో ఓడి పోతాను అని ముందే తెలుసు. ఇవన్నీ తట్టుకుని నేను ఉన్నాను అని తెలిపారు.  ఈసారి పీఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదు. ఎంపీగా పోటీ చేసే విషయం పెద్దలను కలిసి చర్చించి తరువాత తుది నిర్ణయం ఉంటుందని స్పస్టం చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news