చంద్రబాబు ఇంటి దగ్గరే…నీ రెండు చెప్పులు దొరుకుతాయి – గ్రంధి శ్రీనివాస్

-

చంద్రబాబు ఇంటి దగ్గరే…నీ రెండు చెప్పులు దొరుకుతాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు కౌంటర్‌ ఇచ్చారు భీమవరం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్‌, చంద్రబాబుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమేనంటూ ఫైర్‌ అయ్యారు. పేదల కష్టాలు వారికి అవసరం లేదు.. వారాహి యాత్రలో రెండు చెప్పులు పోయాయి అంటున్న పవన్ ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు అంటూ చురకలు అంటించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

చంద్రబాబు ఇంటికి వీధి గుమ్మంలో వెళ్లిన పవన్ ప్యాకేజీ తీసుకుని దొడ్డి దారిన వెళ్లిపోయారని నిప్పులు చెరిగారు. అక్కడే రెండు చెప్పులు వదిలేశారు.. చంద్రబాబు ఇంటికి వెళ్లి వెతికితే రెండు చెప్పులు దొరుకుతాయని చెప్పారు గ్రంధి శ్రీనివాస్‌. పవన్ తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తే.. మీరు టీడీపీతో సహజీవనం చేస్తున్నారని ఆగ్రహించారు. చిరంజీవి ఎవరిని మోసం చేయలేదని… పవన్ అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అభిమానిగా పవన్‌ని కోరేది ఒక్కటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండన్నారు గ్రంధి శ్రీనివాస్‌.

Read more RELATED
Recommended to you

Latest news