రాయలసీమ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

-

రాయలసీమ ప్రాంతం కొందరి కబంద హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీనివాసులు నాకు తెలుసు. నాతో కలిసి ప్రయాణిస్తానని చెప్పారు. రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయింది. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైసీపీ వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమీ మిగలదు. ఉపాధి కోసం చాలా మంది అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారు. భయం వదిలేస్తేనే పరిస్థితులు మారతాయి. జగన్ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.


కర్నూలులో సుగాలి ప్రీతి హత్య నన్ను కలచివేసింది. జనసేన ఒత్తిడి వల్లే ఆ కేసును సీబీఐకి ఇచ్చారు. నాకు వ్యక్తిగతంగా పలుకబడి, డబ్బులు ఉన్నాయి, పెద్ద కుటుంబం ఉంది. కానీ, అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే తెలుగు జాతి నా కుటుంబం అనుకున్నా. ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉందాం. చిన్న కులాల్లో ఐక్యత లేక జగన్కు ఊడిగం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు మా ఆవరణలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి.. లేదంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టుకుంటాం. వైసీపీ కి  కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news