చంద్రబాబు గుట్టు ఐటీ బయటపెట్టింది : మంత్రి పేర్ని నాని

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుట్టును ఐటీ బయటపెట్టిందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే  పేర్ని నాని పేర్కొన్నారు.  చంద్రబాబు కు ఐటీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు  పేర్ని నాని. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని పేర్ని నాని చురకలంటించారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైందన్నారు. 2016 నుంచి చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

 ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారని నాని ఆరోపించారు.  పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని.. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని.. మనోజ్ పార్ధసాని ముడుపులు ఇచ్చినట్లు తేలిందని నాని ఆరోపించారు. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఆయన ప్రశ్నించారు.  చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీతపై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news