మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి..!

-

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయిన సినీ ఫైనాన్సియల్ వెంకట్ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కి పైగా కేసులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఐఆర్ఎస్ అధికారిని అంటూ వెంకట్ మోసాలకు పాల్పడినట్టు తేలింది. నిర్మాతలు సి.కళ్యాణ్, రమేష్ నుంచి ఐఆర్ఎస్ అధికారిని అంటూ రూ.30లక్షలకు పైగా కొట్టేశాడు వెంకట్. ఓ ఐఆర్ఎస్ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్టు సమాచారం.

సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వలవేసి ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు.. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ ని అంటూ విదేశీ యువతులను సైతం వెంకట్ మోసం చేసినట్టు బట్టబయలు అయింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి కూడా వసూలు చేశాడట వెంకట్. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించాడు వెంకట్. అయితే వెంట్ కి సంబంధించిన కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news