ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి శిక్షించాల్సిందే – నారా లోకేష్‌

-

Pinnelli Ramakrishna Reddy :ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి శిక్షించాల్సిందేనని డిమాండ్‌ చేశారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో(202) మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంల ధ్వంసం చేసినట్లు వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. అయితే.. ఈ సంఘటనపై నారా లోకేష్‌ స్పందించారు.

Pinnelli Ramakrishna Reddy who destroyed the EVM should be punished

సొంత బాబాయ్‌ని, ఓటేసి గెలిపించిన ప్ర‌జ‌ల్ని, చివ‌రికి ప్ర‌జాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ఆగ్రహించారు.. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ధ్వంసం చేశాడని మండిపడ్డారు. ఓట‌మి భ‌యంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడుల‌కి తెగ‌బ‌డిన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై ఎన్నిక‌ల సంఘం క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ఫ్యాక్ష‌న్ పాలిటిక్స్‌కి జూన్ 4న ప్ర‌జ‌లు అస‌లు సిస‌లు తీర్పు ఇవ్వ‌బోతున్నారని హెచ్చరించారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news