శుభ కార్యానికి, పరామర్శకు అర్ధం తెలియని వ్యక్తి లోకేష్ – పిన్నెల్లి

-

శుభ కార్యానికి, పరామర్శకు అర్ధం తెలియని వ్యక్తి లోకేష్ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోకేష్ పరామర్శ పేరుతో పల్నాడుకు వచ్చాడని.. చనిపోయిన వ్యక్తి ఇంటికి మెడలో నాలుగు దండలు వేసుకుని వచ్చాడని ఫైర్‌ అయ్యారు. మీసాలు మెలేసి నోటికి వచ్చింది మాట్లాడాడని.. లోకేష్ ముఖంలో నిరాశ, నిస్పృహ కనిపించాయని చురకలు అంటించారు.

జల్లయ్య అనే వ్యక్తి గురించి లోకేష్ ఏమైనా తెలుసా?? అని నిలదీశారు. టీడీపీ హయాంలోనే పది కేసులు ఎఫ్ఐఆర్ అయ్యాయని ఆగ్రహించారు. మాచర్ల నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా పంపించిన బ్రహ్మారెడ్డి గురించి లోకేష్‌కు తెలుసా?? అని నిలదీశారు. నిన్నటి వరకు లోకేష్ హాఫ్ నిక్కర్లు వేసుకుని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్ లో విహార యాత్ర చేస్తూ ఉన్నాడని ఫైర్‌ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news