పిన్నెల్లి పై పుస్తకం.. విడుదల చేసిన టీడీపీ నేతలు

-

నేడు పిన్నెల్లి పైశాచికం పేరుతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలపై టీడీపీ నేతలు పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, కాని వైసీపీ హయాంలో ఈవీఎంలు సైతం ధ్వంసం చేసే పరిస్థితికి మళ్లీ ఫ్యాక్షనిజం పురుడుపోసుకుందని మండిపడ్డారు.

వైసీపీ నేతలు అన్నింటిలో దోపిడియే పనిగా పెట్టుకున్నారని, ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాళ్లకు వాటా ఇవ్వాల్సిందేనని ధ్వజమెత్తారు. ప్రజలు పాస్పుస్తకాలు అప్లయ్ చేసినా, అప్లయ్ చేసినవాళ వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయని, ఈ నేపథ్యంలో అభ్యర్థులు పిన్నెల్లికి నగదు ఇవ్వా ఇవ్వాలని ఆరోపించారు. ఆఖరికి పాస్పుస్తకాల్లో సైతం 15 వేలు దోచుకునే పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉండి వెసీపీ నేతలు రౌడీఇజం ఏ స్థాయికి చేరిందో అర్థంమవుతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news