రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్.. ఈ రోజే పట్టుకుంటామంటున్న పోలీసులు..!

-

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం రాజమండ్రి సెంట్రల్ జోన్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈనెల 28 సాయంత్రం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చేపల వ్యాపారి సంజయ్ అనే ఖైదీ కిడ్నాప్ కు గురయ్యాడు అనేది అందరికి తెలిసిందే. మొత్తం మూడు కోట్ల రూపాయలు బకాయి ఉండటంతో అమలాపురంకు చెందిన ఆక్వా రైతులు అతడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే కిడ్నాపర్లను పట్టుకుంటామని అంటున్నారు పోలీసులు. ఈ రోజే ఎలాగైనా వారికీ పట్టుకొని తీరుతాం అని పేర్కొన పోలీసులు.. ఈ కిడ్నాప్ ఘటన నేపద్యంలో ఇక నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇకపై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news