ఆ బ్యాచ్ కి గుడి కనపడితే వదలరు

-

విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో దేవాలయాల్లో దొంగతనాలు పాల్పడుతున్న ముఠా ను పట్టుకున్నారు పోలీసులు. ఈ విషయాలను విశాఖ రేంజ్ డీఐజీ వివరించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కి తరలిస్తున్నారు. వీళ్లంతా మధురవాడ వాంబే కాలనీ ప్రాంతానికి చెందినవారని చెప్పారు. వీరు ఎక్కువగా దేవాలయాల్లో దొంగతనం చేస్తూ ఉంటారని ఆయన పేర్కొన్నారు.

ఆటోలో తిరుగుతూ, గత నాలుగేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారని, ఇలాంటి దొంగతనాలు, మతవిద్వేషాలు మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వారిని చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శ్రీకాకుళం లో సరస్వతి విగ్రహం పైన రాంగ్ పోస్టింగ్ పెట్టినవారిని కూడా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు వరకు 27 కేసులు నమోదు అయ్యాయి అని, ఈ ఆరుగురు మొత్తం 19 కేసులు దొంగతనాలు అంగీకరించారు అని, ఇందులో 8 నమోదు కాలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news