స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతుందన్న ఆయన ఈ కేసు విచారణ కు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదని అన్నారు. అంతే కాక స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేక పోతున్నారని ఆయన అన్నారు.
ట్రీట్ మెంట్ కు అధికంగా డబ్బులు వసూలు చేశారని తేలిందని, నోటీసులు కూడా ఆస్పత్రి బోర్డు సభ్యులుకు ఇచ్చామని అన్నారు. ముఖ్యంగా టాప్ మేనేజ్మెంట్ కోసం వెతుకుతున్నామన్న అయన ఈ ఘటనలో అన్యాయంగా పది మంది మృతి చెందారని అన్నారు. అందులో ఎనిమిది మందికి నెగిటివ్ కూడా వచ్చిందని అన్నారు. దర్యాప్తు కు సహకరిస్తే .. వారికే మంచిదన్న ఆయన ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే .. లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు.