నన్ను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర చేస్తున్నారు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తనపై  పరువు నష్టం దావా వేయడం పై  తీవ్రంగా స్పందించారు పోసాని. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష కట్టారంటూ సచివాలయంలో చంద్రబాబు, లోకేష్ ద్వయంపై విరుచుకుపడ్డారు.

“నేను అమ్ముడు పోయే వ్యక్తిని కానని.. వైఎస్ జగన్ వ్యక్తిత్వం చేరే ఆయన చెంతకు చేరాను. నా జీవితాంతం వైఎస్ జగన్ వెంట ఉంటాను. చావుకు భయపడని వ్యక్తిని. నన్ను చంపాలని నారా లోకేష్ కుట్ర చేస్తున్నారు. మంగళగిరి కోర్టుల చుట్టూ నన్ను తిప్పాలని.. నేను వెళ్లినప్పుడు చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోతే దానికి లోకేష్ దే బాధ్యత. అయినా చావుకు నేను భయపడను’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే నాపై కక్ష గట్టారు. అందుకే నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news