సీఎం జగన్ పాలన బాగోలేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటా – పోసాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ ఎఫ్డిసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. అమరావతి భూములపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు అసలు సిగ్గు ఉందా..? అని ప్రశ్నించారు. అమరావతి రైతులు రుణమాఫీ తీసుకోలేదా..? అంటూ నిలదీశారు. అక్కడ సెంటు భూమి అడిగితే స్టే తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. అమరావతిలోని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణమని అన్నారు.

చంద్రబాబుకు పేదల ఉసురు తగిలి కుళ్ళి కుళ్ళి చస్తాడని అన్నారు. సీఎం జగన్ పాలన బాలేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని అన్నారు పోసాని. కమ్మవాడిగా చెబుతున్నా.. అమరావతి రైతులు చంద్రబాబు మాటలు నమ్మవద్దని సూచించారు. జగన్ మంచి చేస్తుంటే బాబుకు ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. తాను కమ్మ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని.. ఎందుకంటే అదే కులంలో చంద్రబాబు పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news