న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

ఏపీలోని ప్రకాశం జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు.

A terrible accident in AP Three youths died

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్‌(20), శ్రీనివాస్‌(21), రాహుల్‌(21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ ప్లాజా వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news