రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదు – దేవినేని ఉమా

-

స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు ఈరోజు వేకువజామున అరెస్ట్ చేశారు. దీంతో ఏపీవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం, కర్నూలు, కడప నుంచి వచ్చిన బెటాలియన్లు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ కి చేరుకొని నోటీసులు అందజేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేసి చంద్రబాబును విజయవాడకు తరలించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని జిల్లాలలో టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

గొల్లపూడి లో దేవినేని ఉమామహేశ్వర రావు ని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టు ముమ్మాటికి అప్రజాస్వామీకం అన్నారు. రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా వేలాదిమంది పోలీసులతో టీడీపీ నాయకులను నిర్బంధిస్తున్నారని.. రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version