ఏపీ ఉద్యోగులకు షాక్‌.. 50% ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు !

-

ఏపీ ఉద్యోగులకు షాక్‌.. 50% ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదట. ఈ విషయాన్ని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. 71 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పటికీ, ఇంకా 50% మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలే ఇవ్వలేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఆర్బీఐ నుంచి 44 వేల కోట్ల రూపాయలు, ఇతర చిల్లర అప్పులు, కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులతో మొదలుకొని 71 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆగ్రహించారు రఘురామకృష్ణ రాజు.

ఢిల్లీ వీధుల్లో ఇంకా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ అధికారులు అప్పుల కోసం తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఐఏఎస్ ల కోసం జీతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కనసా లిటెడ్ ఫండ్ కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఐఏఎస్ ల కూడా జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news